Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా కార్చిచ్చు.. అప్పుడేమో బుష్‌ఫైర్.. ఇప్పుడు పబ్ జీ ఆడితే?

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (15:42 IST)
ఆస్ట్రేలియాలో ఇటీవల కాలంలో కార్చిచ్చు సంఘటనతో ఎన్నో మూగజీవులు బలైన సంగతి తెలిసిందే. అలాగే ఎంతో విలువైన అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఎంతో ఆస్తి నష్టం సంభవించింది.

ఆ నష్టాన్ని కొంత వరకు పూడ్చేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు ప్రముఖ గేమింగ్‌ సంస్థ పబ్‌జి కార్ప్‌ ముందుకు వచ్చింది. ఇక బెతెస్ధ, యుబిసాఫ్ట్‌ వంటి పలు గేమింగ్‌ కంపెనీలు కూడా ఆస్ట్రేలియా కార్చిచ్చు నష్టాన్ని పూడ్చేందుకు సహాయం చేయడానికి ముందుకు రానున్నాయి. 
 
తాజాగా పబ్‌జి మొబైల్‌ గేమ్‌లో అందుబాటులో ఉన్న ఆస్ట్రేలియా ఫైర్‌ రిలీఫ్‌ పాన్‌ స్కిన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో ఆ కొనుగోళ్లు ద్వారా వచ్చిన మొత్తాన్ని పబ్‌జి కార్ప్‌ ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు అందజేయనుంది. అలాగే కాల్‌ ఆఫ్‌ డ్యూటీ మొబైల్‌ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. ఆ గేమ్‌ను ఆడడం వల్ల కూడా యూజర్లు సదరు బాధితులకు సహాయం చేయవచ్చు. 
 
ఇప్పటికే ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిర్వహించనున్న ''బుష్‌ఫైర్‌ క్రికెట్‌ బాష్‌" అనే చారిటీ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ల్లో ఓ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోచ్‌గా వ్యవహరిస్తే.. మరో టీమ్‌లో టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ఆడాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments