5జీ చిప్‌సెట్‌‌తో హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. కానీ గూగుల్ మాత్రం?

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (19:06 IST)
Smart phone
హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. హానర్‌ సంస్థ తన 30 సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 30ఎస్‌ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యధునిక ఫీచర్లు పొందుపరిచారు. 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డి, ఫుల్‌వ్యూ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోను.. కిరిన్‌ 820 ప్రాసెసర్‌ 5జీ చిప్‌సెట్‌ కలిగివుంది.
 
ఇంకా ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్పీ కెమెరా ఒకటే ఉంది. 8జీబీ, 128 జీబీ, 8జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్‌ను చైనాలో ప్రీఆర్డర్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 7న నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. 
 
నలుపు, ఆకుపచ్చ, తెలుగు రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యమవుతుంది. కానీ ఈ ఫోనులో గూగుల్‌ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ప్లేస్టోర్‌ యాప్‌ ఉండదు. 16 ఎంపీ సెల్ఫీకెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగివుండే ఈ ఫోన్ (8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్) ధర రూ.25,500 లని హానర్ సంస్థ వెల్లడించింది. అలాగే 8జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 29,000లని హానర్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments