Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగింపు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (13:26 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలోనూ రోజూ రోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. చాలావరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. తాజాగా కేంద్రం మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 
 
ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని డిసెంబర్ 31వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని నెలల పాటు 'వర్క్ ఫ్రం హోం' సౌకర్యాన్ని కేంద్రం పొడిగించింది.
 
గతంలో విధించిన గడువు జూలై 31తో ముగుస్తున్న తరుణంలో... కోవిడ్‌-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని 2020 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ సర్వీసు ప్రొవైడర్లకు నిబంధనలు, షరతులలో డాట్‌ సడలింపులు ఇచ్చిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ట్వీట్‌ చేసింది.
 
భారత్‌లో ప్రస్తుతం 85శాతం మంది ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు కరోనా ముప్పు నుంచి తప్పుకోవచ్చునని ఐటీ శాఖ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments