Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, మధ్యాహ్నం భోజనంపై గూగుల్ కోత

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (17:24 IST)
సాధారణంగా ఉద్యోగులకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో గూగుల్ సంస్థ ఎల్లవేళలా ముందు వరుసలో ఉంటుంది. కానీ, కంపెనీపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా, చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, మధ్యాహ్న భోజనం వటి వాటిని ఆపేయాలని గూగుల్ నిర్ణయించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది., ఈ మేరకు కంపెనీ ప్రధాన ఆర్థిక అధికారి రుత్‌ పోరట్‌ ఉద్యోగులకు లేఖ రాశారు.
 
మరోవైపు ఖర్చులను తగ్గించుకోవడం కోసం కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం నిలిపివేస్తున్నట్లు పోరట్‌ పేర్కొన్నారు. ప్రాధాన్యానికి అనుగుణంగా.. ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. అందులో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర పనుల్లోకి బదిలీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 
ల్యాప్‌టాప్‌ల కొనుగోలును సైతం తగ్గించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ ప్రోత్సాహకాల కుదింపు ఆఫీసులు ఉన్న ప్రాంతాలు.. అక్కడ ఉండే వసతులను బట్టి మారుతుందని స్పష్టం చేశారు. వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే గూగుల్‌ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఇటీవలే 12,000 మందిని ఇంటికి పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments