పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.10వేలు జరిమానా (video)

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (20:39 IST)
పా న్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.10వేల జరిమానా విధించేందుకు రంగం సిద్ధం అవుతోంది. పాన్ ఆధార్ లింక్ చేయాలని ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ ఈ నెల 30వ తేదీ వరకు గడువు విధించింది. పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తే.. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తుంది. అయితే ఈ రెండు కార్డులను కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలిని అధికారులు సూచిస్తున్నారు.
 
కేంద్ర ప్రభుత్వం మరోసారి పాన్, ఆధార్ అనుసంధాన గడువును పొడిగించింది. ఇప్పటికే గడువు చాలా సార్లు పొడిగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్‌కు జూన్ 30 డెడ్‌లైన్‌గా ఉందన్నారు. ఈలోపు రెండింటినీ లింక్ చేసుకోవాలి. పాన్, ఆధార్ అనుసంధానానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
 
ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు వెళ్లి పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేసుకోవచ్చు. నిర్ణీత గడువులోగా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేసుకోకపోతే.. పాన్ నెంబర్ పని చేయదు. తర్వాత ఆదాయపు పన్ను శాఖ నుంచి సమస్యలు వస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ సెక్షన్ కింద రూ.10,000 జరిమానా ఎదుర్కోవలసి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments