Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

మీరు భారతీయులేనా? జాతీయత నిరూపించుకోండి?

Advertiesment
UIDAI
, బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (13:43 IST)
మీరు భారతీయులేనా? మీ జాతీయ ఏంటి.. ఇపుడు జాతీయతను నిరూపించుకోండి అంటూ 127 మంది హైదరాబాదీలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) షాక్‌ ఇచ్చింది. ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.
 
తమ ఆదేశాల ప్రకారం భారత పౌరులమని నిరూపించుకోకపోతే ఆధార్‌ కార్డులను రద్దు చేస్తామని తెలిపింది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తోన్న సత్తర్‌ ఖాన్‌ అనే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలతో ఆధార్‌ కార్డు అందుకున్నారన్న ఫిర్యాదు మేరకు ఉడాయ్‌ ఈ నెల 3వ తేదీన అతనికి నోటీసులు జారీ చేసింది.
 
పౌరసత్వం లేకపోతే, భారత్‌లోకి చట్టబద్ధంగానే ప్రవేశించామన్న విషయాన్ని నిరూపించుకోవాలని తేల్చిచెప్పింది. దీంతో అతడు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తన ఆవేదనను తెలిపాడు. 
 
పౌరసత్వం నిరూపించుకోవాలని, ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 20లోగా విచారణకు రావాలని  127 మంది హైదరాబాదీలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీసులు జారీ చేసిన విషయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విరుచుకుపడ్డారు.
 
'పౌరసత్వాన్ని ధ్రువీకరించే అధికారం ఉడాయ్‌కు లేదు. ఆధార్‌ కార్డులను తప్పుడు సమాచారంతో పొందితే దాన్ని పరిశీలించేందుకు కొన్ని అధికారాలు మాత్రమే ఉడాయ్‌కు ఉంటాయి. చట్టబద్ధమైన ప్రక్రియను ఉడాయ్‌ పాటించలేదు. తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసింది' అని అసదుద్దీన్ ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ చేతకానితనం తెలిసిపోయింది : బోండా ఉమ