వాట్సాప్ సాంకేతిక లోపం టెలిగ్రాంకు అలా కలిసొచ్చింది

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (15:23 IST)
వాట్సాప్ సాంకేతిక లోపం టెలిగ్రామ్‌కు కలిసొచ్చింది. ఇప్పటివరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వాట్సాప్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ను 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తుండగా టెలిగ్రామ్‌ను కేవలం 10 కోట్ల మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. 
 
బుధవారం ఫేస్‌బుక్ మెసేజింగ్ యాప్, వాట్సాప్ రెండూ సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో యూజర్లు భారీ సంఖ్యలో టెలిగ్రాం యాప్ వైప్ మళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా టెలిగ్రాం వెల్లడించింది. బుధవారం నాడు కొన్ని గంటల వ్యవధిలో వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవలు నిలిచిపోవడంతో ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు 30 లక్షల మంది కొత్త యూజర్లు టెలిగ్రాం నెట్‌వర్క్‌లో చేరారని టెలిగ్రాం సంస్థ తెలిపింది. 
 
వాట్సాప్‌కు పోటీగా ఎంట్రీ ఇచ్చిన టెలిగ్రాంకు మొదట్లో బాగా ఆదరణ ఉన్నప్పటికీ సరికొత్త ఫీచర్లతో వాట్సాప్ దూసుకుపోవడంతో బాగా వెనుకబడింది. ప్రస్తుతం టెలిగ్రాం 10 కోట్ల మంది వినియోగదారులతో ఉంది. ఫేస్‌బుక్ యాజమాన్యంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లకు బుధవారం నాడు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కొన్ని కోట్ల మంది యూజర్లు ఫిర్యాదులు చేసారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ కూడా ధృవీకరించింది. అయితే గురువారం ఉదయానికల్లా సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments