మాపెల్స్‌ డాట్‌ కామ్‌పై మాపెల్స్‌ రియల్‌ వ్యూ ద్వారా వర్ట్యువల్‌గా 3డీ మెటావర్శ్‌ మ్యాప్‌ సర్వీస్‌

Webdunia
గురువారం, 28 జులై 2022 (14:42 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ మ్యాప్స్‌- డీప్‌ టెక్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీ  మ్యాప్‌ మై ఇండియా ఇప్పుడు ప్రజల కోసం మాపెల్స్‌ రియల్‌ వ్యూ ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశపు మొట్టమొదటి, పూర్తి దేశీయ ఆల్‌ ఇండియా 360 డిగ్రీ పనోరమిక్‌ స్ట్రీట్‌ వ్యూ, 3ఈ మెటావర్శ్‌ మ్యాప్‌ సేవలను భారతదేశపు సొంత, ఉచిత మ్యాపింగ్‌ పోర్టల్‌ మాపెల్స్‌ డాట్‌ కామ్‌పై  వీక్షించవచ్చు. మొబైల్స్‌, డెస్క్‌టాప్‌లపై అందుబాటులో ఉండే వెబ్‌తో పాటుగా మాపెల్స్‌ యాప్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌పై కూడా అందుబాటులో ఉంటుంది.

 
ఈ ఆవిష్కరణ సందర్భంగా మ్యాప్‌మై ఇండియా సీఈవో మరియు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  రోహన్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ మాపెల్స్‌ రియల్‌ వ్యూ ఇప్పుడు మాపెల్స్‌ డాట్‌ కామ్‌, మాపెల్స్‌ యాప్‌పై లభ్యమవుతుంది. వినియోగదారులు వర్ట్యువల్‌గా భారతదేశాన్ని గతంలో ఎన్నడూ చూడని రీతిలో అన్వేషించడంతో పాటుగా వీధుల అందాలు, రోడ్లు, పలు పర్యాటక ప్రాంతాలు, గృహ, వాణిజ్య ప్రాంతాలు, హైవేలను వీక్షించవచ్చు.

 
విదేశీ మ్యాప్‌ యాప్‌లకు భిన్నంగా దేశీయ ప్రత్యామ్నాయం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సామర్థ్యం పరంగా అత్యాధునికమైనది కావడంతో పాటుగా వినియోగదారులకు మరింత విలువనూ అందిస్తుంది. భారతదేశంలోని వినియోగదారులు మాపెల్స్‌ వినియోగించడంతో పాటుగా మాకు తగిన ఫీడ్‌బ్యాక్‌ అందించగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు. వినియోగదారులు మాపెల్స్‌ రియల్‌ వ్యూను పూర్తి ఉచితంగా మాపెల్స్‌ డాట్‌ కామ్‌  పోర్టల్‌ లేదా మాపెల్స్‌ యాప్‌ పై పొందవచ్చు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments