Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్-ఆధార్ అనుసంధానం.. మార్చి 31, 2022 వరకు పొడిగింపు

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (11:30 IST)
పాన్‌ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తోందని టెన్షన్ పడనక్కర్లేదు. పాన్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసే తుది గడువును మరో ఆరు నెలలు కేంద్రం పొడిగించింది. 
 
మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఐటీ చట్టంలో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్‌కు కూడా గడువును మార్చి 31 వరకు పొడిగించారు. 
 
బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్‌ చేయడం, డీమ్యాట్‌ ఖాతా తెరవడం, స్థిరాస్తుల లావాదేవీ, సెక్యూరిటీలలో లావాదేవీలు వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి. 
 
కాగా.. పాన్‌కార్డుకు ఆధార్‌తో అనుసంధానం గడువును కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. చివరిగా ఈ నెలాఖరుతో గడువు పూర్తి అవుతుండగా.. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది మార్చినెల వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
గడువులోగా మీరు పాన్‌తో ఆధార్ అనుసంధానం చేయకుంటే.. పాన్‌కార్డు చెల్లుబాటు కాదు. చెల్లని పాన్‌కార్డుతో లావాదేవీలు జరిపినట్లైతే.. భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పటికి మీరు ఇంకా లింక్ చేసుకోకపోతే వెంటనే రెండింటినీ అనుసంధానం చేసుకోండి.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments