Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపీరైట్ చట్టం కింద గూగుల్ సీఈవోపై ముంబైలో కేసు నమోదు

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (19:21 IST)
ప్రముఖ టెక్ ఇంజిన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదైంది. కాపీరైట్ చట్టం కింద ఈ కేసును ముంబై పోలీసులు నమోదు చేశారు. బాలీవుడ్ నిర్మాత సునీల్ దర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాపీరైట్ చట్టం కింద సెక్షన్లు 51, 63, 69 కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. యూట్యూబర్ గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. గత 2017లో విడుదలైన "ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా" చిత్రానికి సంబంధించి కేసు నమోదు చేశారు. 
 
దీనిపై సునీల్ దర్శన్ స్పందిస్తూ, తన సినిమాను యూట్యూబ్‌లో అనధికారికంగా అప్‌లోడ్ చేశారని దాన్ని గూగుల్ అనుమతించిందని చెప్పారు. ఈ విషయంపై ఈమెయిల్ ద్వారా వారిని పలుమార్లు సంప్రదించినప్పటికీ వారి నుంచి సమాధానం రాలేదని చెప్పారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments