Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపీరైట్ చట్టం కింద గూగుల్ సీఈవోపై ముంబైలో కేసు నమోదు

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (19:21 IST)
ప్రముఖ టెక్ ఇంజిన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదైంది. కాపీరైట్ చట్టం కింద ఈ కేసును ముంబై పోలీసులు నమోదు చేశారు. బాలీవుడ్ నిర్మాత సునీల్ దర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాపీరైట్ చట్టం కింద సెక్షన్లు 51, 63, 69 కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. యూట్యూబర్ గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. గత 2017లో విడుదలైన "ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా" చిత్రానికి సంబంధించి కేసు నమోదు చేశారు. 
 
దీనిపై సునీల్ దర్శన్ స్పందిస్తూ, తన సినిమాను యూట్యూబ్‌లో అనధికారికంగా అప్‌లోడ్ చేశారని దాన్ని గూగుల్ అనుమతించిందని చెప్పారు. ఈ విషయంపై ఈమెయిల్ ద్వారా వారిని పలుమార్లు సంప్రదించినప్పటికీ వారి నుంచి సమాధానం రాలేదని చెప్పారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments