Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ ఐటీ నిపుణులకు బైడెన్ గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (23:14 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. డొనాల్ట్ ట్రంప్ విధానాలకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నారైలకు సుముఖంగా వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా వుంటూ.. తన పని తాను చేసుకుపోతున్న జో బైడెన్.. తాజాగా భారతీయ ఐటీ నిపుణులకు మరో తీపి కబురు అందించారు. మరింత మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇమ్మిగ్రేషన్ విధానానికి సమూల మార్పులు చేయ సంకల్పించారు. 
 
అమెరికాలో అన్ డాక్యుమెంటెడ్ జాబితాలో ఉన్న వలస కార్మికులు 1.1 కోట్ల మందికి శరవేగంగా పౌరసత్వం కల్పించేందుకు రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టారు బైడెన్‌. అయితే ఈ ప్రతిపాదనకు బైడెన్‌కు రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వచ్చే విద్యార్థులకు అనుమతులు ఇవ్వాలని, ఉపాధి హామీ ఆధారిత గ్రీన్ కార్డుల సంఖ్యను పెంచాలని మరో నిబంధనను ప్రతిపాదించారు.
 
బైడెన్ ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనల వల్ల అమెరికాలోకి మరింత మంది విదేశీ నిపుణులు రావడానికి వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల అమెరికా కంపెనీల్లో అధిక నిపుణులైన కార్మికులకు హెచ్‌-1బీ వీసాలపై పరిమితులు ఉండవని బిజినెస్ గ్రూపులు భావిస్తున్నాయి. దీని ప్రకారం భవిష్యత్‌లో అత్యధిక నిపుణులకు ఉపాధి కల్పించేందుకు వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments