Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి యాపిల్.. తిరుపతికి తెచ్చేందుకు అమెరికా వెళ్లనున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రను పారిశ్రామికంగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియాను ఆంధ్రప్రదేశ్‌క

Webdunia
బుధవారం, 3 మే 2017 (11:11 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రను పారిశ్రామికంగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియాను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించారు. ఇదేవిధంగా అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ సంస్థ తన తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఫుల్ జోష్‌లో ఉన్న చంద్రబాబు నాయుడు తాజాగా టెక్ దిగ్గజం యాపిల్‌పై దృష్టి సారించారు.
 
అందుకే చంద్రబాబు అమెరికా ట్రిప్పేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా యాపిల్‌ను తిరుపతికి తీసుకురావడమే లక్ష్యమని సమాచారం. ఇందులో భాగంగా యాపిల్ సీఈవోతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. గూగుల్ యాజమాన్యంతో కూడా చంద్రబాబు సమావేశమవుతారు. 
 
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఐటీ కంపెనీలను లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న మేథాటవర్స్‌లో ఏడు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ కొత్త కంపెనీల్లో స్పెయిన్‌కు చెందిన గ్రూపో అంటోలిన్, జర్మనీకి చెందిన ఐఈఎస్, ఎంఎన్సీ రోటోమేకర్, అమెరికాకు చెందిన మెస్లోవా, చందుసాఫ్ట్, ఈసీ సాఫ్ట్, యమైహ్ ఐటీ సొల్యూషన్స్ ఉన్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments