Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి రిలయన్స్ జియో ఉచిత ఫోన్‌కాల్స్..

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (09:31 IST)
దేశ ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకను ఇచ్చింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీని పూర్తిగా రద్దు చేసింది. నిజానికి ఈ విధానం శుక్రవారంతో ముగిసింది. దీంతో పాత విధానం ప్రకారం ఉచిత ఫోన్ కాల్స్ సదుపాయాన్ని కల్పించింది. 
 
రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉచిత ఫోన్ కాల్ సదుపాయాన్ని కల్పించింది. ఆ తర్వాత ఐయూసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో అనేక మంది ఖాతాదారులు పెదవి విరిచారు. పైపెచ్చు.. అనేక మంది ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. 
 
ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జియో కస్టమర్లు దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జి (ఐయూసీ) విధానం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది.
 
"ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత కాల్స్‌ను పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడే ఉన్నాం. 2021 జనవరి 1 నుంచి జియో వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు" అని రిలయన్స్‌ జియో గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments