నేటి నుంచి రిలయన్స్ జియో ఉచిత ఫోన్‌కాల్స్..

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (09:31 IST)
దేశ ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకను ఇచ్చింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీని పూర్తిగా రద్దు చేసింది. నిజానికి ఈ విధానం శుక్రవారంతో ముగిసింది. దీంతో పాత విధానం ప్రకారం ఉచిత ఫోన్ కాల్స్ సదుపాయాన్ని కల్పించింది. 
 
రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉచిత ఫోన్ కాల్ సదుపాయాన్ని కల్పించింది. ఆ తర్వాత ఐయూసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో అనేక మంది ఖాతాదారులు పెదవి విరిచారు. పైపెచ్చు.. అనేక మంది ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. 
 
ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జియో కస్టమర్లు దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జి (ఐయూసీ) విధానం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది.
 
"ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత కాల్స్‌ను పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడే ఉన్నాం. 2021 జనవరి 1 నుంచి జియో వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు" అని రిలయన్స్‌ జియో గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments