Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.99 ప్లాన్‌లో మార్పులు చేసిన ఎయిర్‌టెల్.. జియో దెబ్బకు...

రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరల విషయంలో రోజురోజుకూ దిగివస్తోంది. తనకంటే ప్రత్యర్థి కంపెనీ రిలయన్స్ సేవలపై తమ కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో వారిని కాపాడుకునేందుకు వీలుగా త

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (15:52 IST)
రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ధరల విషయంలో రోజురోజుకూ దిగివస్తోంది. తనకంటే ప్రత్యర్థి కంపెనీ రిలయన్స్ సేవలపై తమ కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో వారిని కాపాడుకునేందుకు వీలుగా తన ప్లాన్‌లలో మార్పులు చేస్తోంది.
 
ఇందులోభాగంగా, ఎయిర్‌టెల్ తన రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఈ మార్పుల మేరకు ఇకపై నెలకు 2జీబీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. 
 
నిజానికి ఇప్పటివరకు రూ.99 ప్లాన్‌లో నెలకు ఒక జీబీ డేటా మాత్రమే ఉచితం. రిలయన్స్ జియో రూ.98 ప్లాన్‌లో నెలకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లను ఆఫర్ చేస్తోంది. 
 
దీంతో ఎయిర్‌టెల్ కూడా దిగివచ్చింది. రూ.99 ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో అన్ లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లను కూడా ఉచితంగా అందివ్వనుంది. బీఎస్ఎన్ఎల్ కూడా ఇదే ప్లాన్ కింద రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments