Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు బాదుడుకు సంకేతాలు ఇచ్చిన ఎయిర్‌టెల్

Webdunia
శనివారం, 21 మే 2022 (15:30 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ మరోమారు తన కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. యూజర్ చార్జీలను 10 నుంచి 20 శాతం మేరకు పెంచాలని భావిస్తుంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో గోపాల్ మిట్టల్ సంకేతాలు ఇచ్చారు. 
 
గత యేడాది నవంబరు - డిసెంబరు నెలలో ఈ కంపెనీ భారీగా చార్జీలను పెంచిన విషయం తెల్సిందే. అపుడు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు 18 నుంచి 25 శాతం మేరకు టారిఫ్‌లను పెంచేశాయి. ఇపుడు మరో విడత పెంపునకు సిద్ధమవుతున్నాయి. 
 
గతంలో పెంచిన పెంపుదలతో ఒక్కో యూజర్ నుంచి ఎయిర్ టెల్ కంపెనీ నెలకు సగటున రూ.178 వరకు ఆదాయాన్ని అర్జిస్తుంది. దీన్ని రూ.200కు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ కంపెనీ సీఈవో గోపాల్ మిట్టల్ తెలిపారు. అంటే త్వరలోనే ఎయిర్‌టెల్ చార్జీలను పెంచనున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువరించారు. 
 
ప్రస్తుతం ప్రీపెయిడ్ చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి కనీస ధరను రూ.200గా చేర్చాల్సిన అవరం ఎంతైనా ఉందని గోపాల్ మిట్టల్ అన్నారు. అంటే కనీసం 10 నుంచి 20 శాతం మేరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments