Webdunia - Bharat's app for daily news and videos

Install App

4జీ హ్యాండ్‌సెంట్లలో ఎయిర్ టెల్‌‍ 5జీ సేవ‌లు

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం తన వినియోగదారులకు తీపికబురు చెప్పింది. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 5జీ సేవ‌ల‌కు పునాదిగా భావించే 'మాసివ్ మల్టిపుల్-ఇన్‌పుట్ మ‌ల్టిపుల్ ఔట్‌ప

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (15:07 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం తన వినియోగదారులకు తీపికబురు చెప్పింది. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 5జీ సేవ‌ల‌కు పునాదిగా భావించే 'మాసివ్ మల్టిపుల్-ఇన్‌పుట్ మ‌ల్టిపుల్ ఔట్‌పుట్ (మీమో)' టెక్నాల‌జీని భార‌త్‌లో ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. 
 
తొలుత బెంగ‌ళూరు, కోల్‌క‌తా న‌గ‌రాల్లో ఈ సేవ‌ల‌ను ప్రారంభించి, ఆ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపింది. ఈ టెక్నాల‌జీ వ‌ల్ల మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్ మ‌రింత వేగ‌వంతం కానుంది. ఇది అమ‌ల్లోకి వ‌స్తే ప్ర‌స్తుతం ఉన్న నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యం 5-6 రెట్లు మెరుగుప‌డి, డేటా స్పీడ్ 2-3 రెట్లు పెరుగుతుంద‌ని ఎయిర్‌టెల్ అభిప్రాయ‌ప‌డింది. 
 
అయితే, వినియోగ‌దారులు ఉప‌యోగిస్తున్న 4జీ హ్యాండ్‌సెట్‌లోనే ఎలాంటి టారిఫ్‌లు, మార్పులు చేయ‌కుండా 5జీ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రారంభించిన 'ప్రాజెక్ట్ లీప్'లో భాగంగా ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవ‌ల టెలికాం శాఖ 2020లోగా భార‌త్‌లోకి పూర్తిస్థాయి 5జీ సేవ‌ల‌ను తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకోసం రూ. 500 కోట్ల నిధిని కూడా ప్ర‌భుత్వం కేటాయించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments