ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్... కొత్త కస్టమర్లకే...

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (14:06 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది. దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియే సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో టెలికాం ధరలు కూడా కిందికి దిగివచ్చాయి.
 
అదేసమయంలో టెలికాం కంపెనీల మధ్య ఏర్పడిన పోటీ కారణంగా వివిధ రకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేపనిలో నిమగ్నమయ్యాయి. ఇందులోభాగంగా, ఇపుడు ఎయిర్‌టెల్ కంపెనీ తన కొత్త కస్టమర్ల కోసం రూ.76 రీఛార్జ్‌తో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న కొత్త కస్టమర్లకు రూ.26 టాక్ టైమ్ కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ కాలపరిమితి 28 రోజులుగా నిర్ణయించింది. ఇది కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది. 
 
ఎయిర్ టెల్ కొత్త కస్టమర్లు ముందుగా రూ.76 ఫస్ట్ టైం రీఛార్జ్ (ఫస్ట్ రీఛార్జ్) చేయించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదిలో ఎఫ్ఆర్సీ రీఛార్స్‌లపై వరుసగా రూ.178, రూ.229, రూ.344, రూ.495, రూ.599 ప్యాకులను అందిస్తోన్న ఎయిర్ టెల్ జాబితాలో రూ.76 రీఛార్జ్ వచ్చి చేరింది. ఈ ఎఫ్ఆర్సీ పోర్ట్ పోలియో నుంచి కొత్త కస్టమర్లు 126 జీబీ డేటా బెనిఫెట్స్ పొందవచ్చు. వాయిస్ కాల్స్ ప్రతి నిమిషానికి 60 పైసలు చొప్పున ఛార్జ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments