Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త.. ఎయిర్‌టెల్ బ్లాక్ లాంఛ్

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (22:09 IST)
ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త. పోస్ట్‌పెయిడ్, డైరెక్ట్ టు హోం (డీటీహెచ్), ఫైబర్ సర్వీసులను ఎయిర్‌టెల్ ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చింది. అంటే ఇకపై ఇవన్నీ ఒకే బిల్లుపై లభిస్తాయన్నమాట. ఎయిర్ టెల్ తాజాగా 'ఎయిర్‌టెల్ బ్లాక్'ను లాంచ్ చేసింది. ఇందులో పలు ప్లాన్లు ఉన్నాయి. ఇవి నచ్చని వారు సొంతంగా తామే ఓ ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్లు రూ. 998 నుంచి మొదలవుతాయి. 
 
ఎయిర్‌టెల్ బ్లాక్ నేటి నుంచే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక డీటీహెచ్ కనెక్షన్, రెండు పోస్టుపెయిడ్ మొబైల్ కనెక్షన్లు నెలకు రూ. 998తో లభిస్తాయి. మూడు మొబైల్ కనెక్షన్లు, ఒక డీటీహెచ్ కనెక్షన్ రూ. 1,349తో అందుబాటులో ఉంది. 
 
అలాగే, ఒక ఫైబర్ కనెక్షన్, రెండు పోస్టు పెయిడ్ మొబైల్ కనెక్షన్లను రూ. 1,598 ప్యాక్‌తో లభిస్తాయి. ఇందులో టాప్ ఎండ్ ప్లాన్ విలువ రూ. 2,099. ఇందులో మూడు మొబైల్ కనెక్షన్లు, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్ కనెక్షన్ నెల రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉంది.
 
ఈ ఫిక్స్‌డ్ ప్లాన్లు అనువుగా లేవనుకుంటే ఎవరికి వారే రెండు అంతకంటే ఎక్కువ సేవలతో ఓ సొంత ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. అయితే, ఇది ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఖాతాదారులకు వర్తించదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments