Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబుదాబిలో జియో జెండా.. ముబాదలాకు రూ.9003 కోట్ల షేర్లు

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (13:59 IST)
రిలయన్స్ జియో సంస్థ అబుదాబిలో వ్యాపారాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా అబుదాబికి చెందిన ముబాదలా సంస్థ జియోకు చెందిన వాటాలను కొనుగోలు చేసింది. ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. భారీ సంఖ్యలో వినియోగదారులను కలిగివుంది. ఈ సంస్థకు చెందిన కొన్ని వాటాలను అంటే జియోకు చెందిన 9.99% వాటాలు, 5.7 బిలియన్ డాలర్లకు ఫేస్‌బుక్ సంస్థ కొనుగోలు చేసింది. 
 
భారత్ కరెన్సీ విలువ ప్రకారం రూ.43,574 కోట్లు. ఆపై అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ జియోకు చెందిన ఒక శాతం షేర్లను కొనుగోలు చేసింది. దీని విలువ రూ.5,655.75 కోట్లు. ఈ ఒప్పందానికి తర్నాత రిలయన్స్ జియో తన 2.3 శాతం షేర్లను అమెరికా టెక్నాలజీ సంస్థ అయిన విస్టాకు విక్రయించింది. దీని విలువ రూ.11,367 కోట్లు. తద్వారా జియో సంస్థ రూ.60596.37 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 
 
ప్రస్తుతం అబుదాబికి చెందిన ప్రముఖ సంస్థ ముబాదాలా కూడా జియో వాటాలను కొనుగోలు చేసింది. జియోకు చెందిన 1.85శాతానికి చెందిన వాటాలను రూ.9003 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా జియోకు చెందిన 18.97 శాతానికి చెందిన షేర్లను ఆరు అతిపెద్ద కంపెనీలు కొనుగోలు చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments