Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకౌంట్లు, సిమ్‌లకు ఆధార్ అవసరమా..?

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (12:55 IST)
న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థలు ఆధార్​ డేటాను వాడుకునేందుకు అనుమతిస్తూ కేంద్ర సర్కార్​ ‘ఆధార్​ చట్టం’లో చేసిన మార్పులు రాజ్యాంగవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.

ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు, టెలికాం సంస్థలు ఆధార్​ డేటాను తీసుకున్న తర్వాతే సేవలందిస్తున్నాయి. కస్టమర్లకు ఇష్టమైతే స్వచ్ఛందంగా డేటా ఇవ్వొచ్చంటూ కేంద్రం జులైలో ఆధార్ చట్టానికి సవరణ చేయడంతో  ప్రైవేటు సంస్థలు ఆధార్​ డేటాను వాడుకుంటున్నాయి.
 
అయితే, జులైలో కేంద్రం చేసిన సవరణ.. 2019 మార్చి నాటి సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్​ తీర్పును నీరుగార్చేలా ఉందని, ప్రైవేటుకు ఆధార్​ అనుమతి రాజ్యాంగవిరుద్ధమంటూ ఎస్​జీ వొంబాట్కేర్​ అనే రిటైర్డ్​ ఆర్మీ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. దీన్ని సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్​డే, జస్టిస్​ బీఆర్ గవై బెంచ్​ పరిశీలించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా బెంచ్​  కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఆధార్​ చట్టం ప్రమాణికతను సమర్థిస్తూ మార్చిలో తీర్పు చెప్పిన సుప్రీం బెంచ్​.. ఈ చట్టానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, స్వచ్ఛందంగానైనాసరే కస్టమర్ల నుంచి ప్రైవేటు కంపెనీలు ఆధార్​ డేటా సేకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments