Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకౌంట్లు, సిమ్‌లకు ఆధార్ అవసరమా..?

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (12:55 IST)
న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థలు ఆధార్​ డేటాను వాడుకునేందుకు అనుమతిస్తూ కేంద్ర సర్కార్​ ‘ఆధార్​ చట్టం’లో చేసిన మార్పులు రాజ్యాంగవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.

ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు, టెలికాం సంస్థలు ఆధార్​ డేటాను తీసుకున్న తర్వాతే సేవలందిస్తున్నాయి. కస్టమర్లకు ఇష్టమైతే స్వచ్ఛందంగా డేటా ఇవ్వొచ్చంటూ కేంద్రం జులైలో ఆధార్ చట్టానికి సవరణ చేయడంతో  ప్రైవేటు సంస్థలు ఆధార్​ డేటాను వాడుకుంటున్నాయి.
 
అయితే, జులైలో కేంద్రం చేసిన సవరణ.. 2019 మార్చి నాటి సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్​ తీర్పును నీరుగార్చేలా ఉందని, ప్రైవేటుకు ఆధార్​ అనుమతి రాజ్యాంగవిరుద్ధమంటూ ఎస్​జీ వొంబాట్కేర్​ అనే రిటైర్డ్​ ఆర్మీ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. దీన్ని సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్​డే, జస్టిస్​ బీఆర్ గవై బెంచ్​ పరిశీలించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా బెంచ్​  కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఆధార్​ చట్టం ప్రమాణికతను సమర్థిస్తూ మార్చిలో తీర్పు చెప్పిన సుప్రీం బెంచ్​.. ఈ చట్టానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, స్వచ్ఛందంగానైనాసరే కస్టమర్ల నుంచి ప్రైవేటు కంపెనీలు ఆధార్​ డేటా సేకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments