Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో దేశమంతటా 5జీ సేవలు.. ఆటోమేటిక్‌గా ఆ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయట?

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (14:36 IST)
5G technology
5జీ సేవల గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటికే దేశంలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ తో పాటు ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, చెన్నై, లక్నో, పూణే, ఢిల్లీ నగరాల్లో 5జీ సేవలు వినియోగదారుకు అందుబాటులో ఉంచేందుకు సిద్ధంగా వున్నట్లు ఇప్పటికే టెలి కమ్యూనికేషన్ విభాగం ప్రకటన చేసింది.
 
కానీ కనెక్టివీటీ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్, జియో మాత్రమే ఎంపిక చేసిన ప్రదేశాలలో 5జీ సేవలు అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులంతా పూర్తిగా 5జీ సేవలను పొందడం లేదు.
 
మరో ప్రధాన కంపెనీ వీఐ (వొడాఫోన్ ఐడియా) ఇంకా తమ 5జీ సేవల ప్రారంభ తేదీని ప్రకటించలేదు. వచ్చే నెలలో సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
 
భారత టెలీ కమ్యూనికేషన్స్ ప్రకారం 5జీ కనెక్టివిటీ దేశం మొత్తంలో రెండు, మూడేళ్లలో సరసమైన ధరల్లో అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియో వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశం అంతటా తమ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఎయిర్టెల్ కూడా ఈ ఏడాది చివరి నాటికి కీలకమైన మెట్రో నగరాల్లో 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో దేశం అంతటా ప్రారంభించాలని చూస్తోంది. 4జీ కనెక్టివిటీ సిమ్ ఉన్న వినియోగదారులు 5 కనెక్టివిటీ కోసం కొత్త సిమ్ కొనుగోలు చేయనవసరం లేదని జియో, ఎయిర్ టెల్ ప్రకటించాయి. 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లు ఆటోమేటిక్‌గా 5జీ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments