Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ అమ్మకాల జోరు.. కరోనా కాలంలోనూ అదుర్స్

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (10:16 IST)
దేశంలో ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరుగా ఉంటాయని కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌ అంచనా వేస్తోంది. విక్రయాలు 14 శాతం అధికమై 17.3 కోట్ల యూనిట్లకు చేరతాయని వెల్లడించింది. జూలై-డిసెంబరు కాలంలోనే 10 కోట్లకుపైగా స్మార్ట్‌ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లనున్నాయి. కోవిడ్‌-19 పరిమితులు ఎత్తివేసిన తర్వాత జూన్‌ మొదలుకుని కస్టమర్ల నుంచి డిమాండ్‌ ఉంది.
 
ఆగస్ట్‌-నవంబర్‌ మధ్య అమ్మకాల హవా ఉంటుంది. చైనా తర్వాత స్మార్ట్‌ఫోన్ల రంగంలో భారత్‌ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఫీచర్‌ ఫోన్ల నుంచి వినియోగదార్లు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది ఫీచర్‌ ఫోన్లను వాడుతున్నారు. 
 
ఇక కొన్నేళ్లలోనే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 20 కోట్ల మార్కును దాటనుంది. 2019లో దేశంలో 15.8 కోట్ల స్మార్ట్‌ఫోన్లు విక్రయమయ్యాయి. గతేడాది స్వల్పంగా 4 శాతం తగ్గి 15.2 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి.
 
సెకండ్‌ వేవ్‌ వచ్చినప్పటికీ అంచనాలను మించి మార్కెట్‌ వేగంగా పుంజుకుంది. 2021 జనవరి-జూన్‌ కాలంలో అత్యధిక అమ్మకాలను సాధించింది. కోవిడ్‌ కేసులు నియంత్రణలో ఉండి, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కస్టమర్లలో సెంటిమెంట్‌ బలపడుతుందని టెక్నోవిజన్‌ ఎండీ సికందర్‌ తెలిపారు. ఎంట్రీ లెవెల్‌లో సగటు ధర ఏడాదిలో 40 శాతం తగ్గింది. ప్రస్తుతం రూ.15,000లోపు ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments