Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో త్వరలో 5జీ సేవలు... ఈ యేడాది స్పెక్ట్రమ్ వేలం పాట

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (11:27 IST)
దేశంలో ఐదో తరం (5జి) తరంగాల వేలం పాటలు ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, ఈ సేవలను ఎంపిక చేసిన మెట్రో నగరాలు, నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తారు. మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వేలం పాటల ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
 
ప్రస్తుతం దేశంలో 4జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై 5జీ సేవలను ప్రారంభించేందుకు వీలుగా ఈ యేడాది స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు. ఇది టెలికాం రంగం అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుందని ఆమె తెలిపారు. 
 
గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో బ్రాండ్ బ్యాండ్, మొబైల్ సేవల వ్యాప్తి కోసం యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద వచ్చే వార్షిక వసూళ్లలో 5 శాతం నిధులను కేటాయించనున్నట్టు తెలిపారు. పట్టణ వాసులతో సమానంగా గ్రామీణ ప్రజలకు ఎలక్ట్రానిక్, సమాచారం సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో నొక్కివక్కాణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments