Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో '5జీ ఫోన్‌' రచ్చ రచ్చే : ధర రూ.10వేల లోపే!

Advertiesment
JioPhone 5G
, గురువారం, 27 జనవరి 2022 (14:16 IST)
దేశంలో 5జీ నెట్‌వర్క్ కవరేజ్‌కు జియో ఇప్పటికే పనులు పూర్తి చేసుకుంది. తొలిదశలో 13 నగరాల్లో 5జీని ప్రారంభిస్తుందని ఆండ్రాయిడ్ సెంట్రల్ వెల్లడించింది. ఇందులో భాగంగానే జియోఫోన్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ జియోఫోన్ 5జీ ధర రూ.10వేలలోపే ఉండే అవకాశం ఉంది. దీంతో భారత్‌లో అత్యంత చౌకైన 5జీ మొబైల్ ఇదే కానుంది.
 
జియోఫోన్ 5జీ మొబైల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. చీపెస్ట్ 5జీ ప్రాసెసర్‌గా మిడ్ రేంజ్‌ ఫోన్లలో వస్తున్న ఈ చిప్‌సెట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది.  ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో జియోఫోన్ 5జీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఫీచర్స్
6.5 ఇంచుల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 
మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం 
జియో 5జీ ఫోన్‌కు వెనుక రెండు కెమెరాలుంటాయని సమాచారం. 
13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ 
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
జియోఫోన్ 5జీ మొబైల్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 
18వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు వుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్‌లో కల్తీ మద్యానికి ఆరుగురు మృతి