Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. వీడియోలు పోస్టు చేస్తే డబ్బులు

Webdunia
సోమవారం, 31 జులై 2023 (09:50 IST)
ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్. యూట్యూబ్ లాగే ట్విట్టర్‌లో వీడియోలను పోస్ట్ చేసే వ్యక్తులకు డబ్బు చెల్లిస్తామని ట్విట్టర్ ప్రకటించింది. సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా సాధారణ వ్యక్తుల నుండి సెలబ్రిటీల వరకు చాలా మంది ఉపయోగిస్తున్నారు. 
 
దీన్ని ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సదా ట్విటర్‌ వినియోగదారులకు ఊరటనిస్తోంది. అతను అధికారిక బ్లూ టిక్ ధృవీకరణను మూడు టిక్‌లుగా విభజించారు - బ్లూ, గ్రే, గోల్డెన్ కోసం డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు.
 
దీంతో  చాలా మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించాడు. దీంతో చాలా మంది ట్విటర్‌ను వీడుతుండగా, వినియోగదారులను నిలుపుకునేందుకు ఎలోన్ మస్క్ ఓ కొత్త ఆలోచనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం, యూట్యూబ్ వంటి ట్విట్టర్‌లో పోస్ట్ చేసే వీడియోలకు వినియోగదారులకు చెల్లించాలని ట్విట్టర్ నిర్ణయించింది. 
 
యూట్యూబ్ లాగా, ట్విట్టర్ కూడా వీడియోల మధ్య ప్రకటనలను ఉంచుతుంది. అయితే మీరు ట్విట్టర్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా డబ్బు పొందాలనుకుంటే, కొన్ని షరతులు ఉన్నాయి. 
 
ఖాతా తప్పనిసరిగా బ్లూ టిక్ ధృవీకరణను కలిగి ఉండాలి. 500 కంటే ఎక్కువ మంది అనుచరులు ఉండాలి. గత 3 నెలల్లోనే 1.5 కోట్ల ఇంప్రెషన్స్ అందుకుని ఉండాల్సి వుంటుందని ట్విట్టర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments