Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. వీడియోలు పోస్టు చేస్తే డబ్బులు

Webdunia
సోమవారం, 31 జులై 2023 (09:50 IST)
ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్. యూట్యూబ్ లాగే ట్విట్టర్‌లో వీడియోలను పోస్ట్ చేసే వ్యక్తులకు డబ్బు చెల్లిస్తామని ట్విట్టర్ ప్రకటించింది. సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా సాధారణ వ్యక్తుల నుండి సెలబ్రిటీల వరకు చాలా మంది ఉపయోగిస్తున్నారు. 
 
దీన్ని ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి సదా ట్విటర్‌ వినియోగదారులకు ఊరటనిస్తోంది. అతను అధికారిక బ్లూ టిక్ ధృవీకరణను మూడు టిక్‌లుగా విభజించారు - బ్లూ, గ్రే, గోల్డెన్ కోసం డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు.
 
దీంతో  చాలా మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించాడు. దీంతో చాలా మంది ట్విటర్‌ను వీడుతుండగా, వినియోగదారులను నిలుపుకునేందుకు ఎలోన్ మస్క్ ఓ కొత్త ఆలోచనను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం, యూట్యూబ్ వంటి ట్విట్టర్‌లో పోస్ట్ చేసే వీడియోలకు వినియోగదారులకు చెల్లించాలని ట్విట్టర్ నిర్ణయించింది. 
 
యూట్యూబ్ లాగా, ట్విట్టర్ కూడా వీడియోల మధ్య ప్రకటనలను ఉంచుతుంది. అయితే మీరు ట్విట్టర్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా డబ్బు పొందాలనుకుంటే, కొన్ని షరతులు ఉన్నాయి. 
 
ఖాతా తప్పనిసరిగా బ్లూ టిక్ ధృవీకరణను కలిగి ఉండాలి. 500 కంటే ఎక్కువ మంది అనుచరులు ఉండాలి. గత 3 నెలల్లోనే 1.5 కోట్ల ఇంప్రెషన్స్ అందుకుని ఉండాల్సి వుంటుందని ట్విట్టర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments