Webdunia - Bharat's app for daily news and videos

Install App

#EidMubarak నేడు రంజాన్ పండగు... 112 యేళ్ళ తర్వాత ఆ పరిస్థితి...

Webdunia
సోమవారం, 25 మే 2020 (09:00 IST)
ముస్లిం సోదరుల అతిపవిత్రమైన పండుగల్లో ఒకటైన రంజాన్ పండుగ నేడు. అయితే, కరోనా వైరస్ మహమ్మారితో పాటు.. లాక్డౌన్ కారణంగా రంజాన్ సామూహిక ప్రార్థనలు చేసుకోలేని నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. అలాగే, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి. ఫలితంగా ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో ఈ పరిస్థితి ఉత్పన్నంకావడం గత 112 యేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
నిజానికి కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా రంజాన్ మాసం కళ తప్పింది. అందరూ ఎంతో ఇష్టపడే హలీం ఈసారి మాయమైంది. షాపింగ్ లేక మార్కెట్లు కళ తప్పాయి. ఈ సీజన్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు రూ.500 కోట్ల వ్యాపారం సాగేది. లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారం దారుణంగా దెబ్బతింది. 
 
ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాలు సహా నగరంలోని ప్రధాన మార్కెట్లన్నీ బోసిపోయాయి. హైదరాబాద్‌లో రంజాన్ నెలలో 12 వేలకు పైగా హలీం బట్టీలు కనిపించేవి. ఈసారి ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించలేదు. ఇక్కడ తయారు చేసే హలీం విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. హైదరాబాద్ హలీంకు అంతటి ప్రాచూర్యం ఉంది. 
 
అయితే, 112 యేళ్ల క్రితం అంటే 1908లో మూసీనదికి వచ్చిన వరదలు జనజీవనాన్ని కకావికలం చేస్తే ఇప్పుడు కమ్ముకొచ్చిన కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈ రెండు సందర్భాల్లోనూ ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లకే పరిమితం చేశారు. అప్పట్లో ఈద్గాలు, మసీదులు తెరుచుకున్నా ఇంటిలోనే ప్రార్థనలు చేసుకున్నారు. ఇప్పుడు అవి తెరుచుకోకపోవడంతో ఇంటిలోనే ఈదుల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారు.
 
కాగా, ఈ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సమాజానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌తో పాటు మాజీ సీఎం చంద్రబాబు నాయుడులు రంజాన శుభాకాంక్షలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-02- 2025 గురువారం రాశి ఫలాలు : రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు...

సిరుల తల్లి శ్రీలక్ష్మి ఆశీస్సుల కోసం వంటగదిలోని ఈ పదార్థాలను వాడితే?

టీటీడీ సంచలన నిర్ణయం- 18మంది హిందూయేతర ఉద్యోగులపై బదిలీ వేటు

బుధాష్టమి, దుర్గాష్టమి, భీష్మాష్టమి.. కాలభైరవ అష్టకాన్ని చదివితే?

05-02- 2025 బుధవారం దినఫలితాలు : నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments