సురేష్ రైనా రెండో సారి తండ్రి అయ్యాడు.. రియా రైనాకు తమ్ముడొచ్చాడు..

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (13:24 IST)
టీమిండియా మాజీ క్రికెటర్, అదుర్స్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా రెండోసారి తండ్రి అయ్యాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చెన్నై ఫ్యాన్స్ ఆతనిని చిన్న తలై అని పిలుస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో సురేష్ రైనా భార్య రెండో శిశువుకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోను సురేష్ రైనా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో భార్య, శిశువుతో సురేష్ రైనా కనిపించారు. తన కుమార్తె రియా రైనా తమ్ముడిని స్వాగతిస్తున్నామని తెలిపాడు.  
 
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రైనా గత నెలలోనే చెన్నైలో శిక్షణ ప్రారంభించాడు. తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి సాధన చేశాడు. 
 
అయితే కరోనా వైరస్ వ్యాప్తి లోకి రావడంతో ఐపీఎల్‌ను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ శిక్ష‌ణ శిబిరాల్లో ఉన్న‌టువంటి క్రికెటర్లు అందరూ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్‌పై బీసీసీఐ ప్రకటన కొరకు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సందిగ్ధంలో పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments