ధోనీ అభిమానులకు చేదువార్త.. చెన్నై కెప్టెన్సీకి ధోని గుడ్‌బై!

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (15:22 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూల్ కెప్టెన్‌గా పేరున్న ధోనీ అభిమానులకు చేదువార్తే చెప్పారని అనుకోక తప్పదు. అంతర్జాతీయ క్రికెట్‌లో లేకపోయినా ధోనీ ఐపీఎల్‌లో వుంటే చాలునని, ఐపీఎల్ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వుంటే చాలునని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఆ ఫ్యాన్సుకు షాకిచ్చే నిర్ణయాన్ని ధోనీ తీసుకున్నారు. 
 
అదేంటంటే ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్రసింగ్ ధోనీ తప్పుకున్నాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ నిర్ణయం ఫ్యాన్సుకు షాకిచ్చింది. 
 
ఇకపోతే.. ఐపీఎల్ కానుండగా.. తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది. కానీ.. తొలి మ్యాచ్‌ ముంగిట కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేతికి టీమ్ పగ్గాలిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది. 
 
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. ఆ జట్టుని ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. ఇంకేముంది.. కెప్టెన్సీ నుంచి వైదొలగినా.. చెన్నై ఆటగాడిగా ధోనీ దంచేస్తాడంటూ ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments