Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2021: ఫిబ్రవరి 18న వేలం పాట.. వేదికపై ఇంకా..?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (22:01 IST)
IPL 2021
కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 కోసం వేలం పాట త్వరలో ప్రారంభం కానుంది. గత ఏడాది కరోనా కారణంగా లేటుగా ప్రారంభమైన ఐపీఎల్ 2020.. విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. కాగా ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం జరగనుందని సమాచారం.
 
'ఐపీఎల్‌ వేలం ఫిబ్రవరి 18న జరుగుతుంది. వేదిక ఇంకా నిర్ణయించలేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పొట్టి క్రికెట్‌ నిర్వహించే వేదికపై ఇంకా స్పష్టత లేదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత్‌లోనే ఘనంగా నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నామని చెప్పిన సంగతి తెలిసిందే.
 
కరోనా వైరస్‌ వల్ల గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించారు. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్‌ విజేతగా ఆవిర్భవించింది. ట్రోఫీని నిలబెట్టుకుంది. యువకులతో కూడిన దిల్లీ క్యాపిటల్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐపీఎల్‌ రీటెన్షన్‌ తుది గడువు జనవరి 20తో ముగియడంతో జట్లన్నీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా విడుదల చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rains: హైదరాబాద్ అంతటా భారీ వర్షపాతం.. ఆగస్టు 9వరకు అలెర్ట్

Dharmasthala: బాలికను అక్రమంగా ఖననం చేయడాన్ని కళ్లారా చూశాను.. ఎవరు?

ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ : కొట్టుకునిపోయిన గ్రామం

వందేభారత్ తొలి స్లీపర్ రైలు సిద్ధం... ప్రత్యేకత ఏంటి?

Uttarkashi: భారీ వర్షాలు- ఉత్తరకాశిలో ఒక గ్రామమే కొట్టుకుపోయింది.. నివాసితులు గల్లంతు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments