Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-2021: బెంగళూరు కెప్టెన్సీ మధ్యలోనే విరాట్ కోహ్లీ అవుటా?

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (14:47 IST)
ఐపీఎల్‌-2021 మధ్యలోనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీ నుంచి టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిని తొలగించనున్నారు. ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గని అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ కోహ్లి పూర్తిగా విఫలం కావటం వల్లే ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ గత వారం ప్రకటించడం తెలిసిందే. అటు ఐపీఎల్‌లో వచ్చే సీజన్ నుంచి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 
 
కెప్టెన్సీ బాధ్యతల కారణంగా ఏర్పడుతున్న ఒత్తిడి తన ఆటపై ప్రతికూల ప్రభావం చూపుతున్న కారణంగా కోహ్లీ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వన్డేల్లో మాత్రం టీమిండియాకు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్‌ వరకు క్రికెట్ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న చర్చ కూడా జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

Andhra liquor scam: వైకాపాకు కొత్త తలనొప్పి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సమన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

తర్వాతి కథనం
Show comments