Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఐపీఎల్-14 సీజన్ రెండో దశ పోటీలు ప్రారంభం

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (11:30 IST)
కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా నిలిపివేసిన ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు ఆదివారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు ఆదివారం నుంచే ప్రారంభంకానున్నాయి. 
 
దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్ 2021 సీజన్ మొదటి దశలో 29 మ్యాచ్‌లే జరగగా.. రెండో దశలో మిగిలిన 31 మ్యాచ్‌ల్ని అక్టోబరు 15 వరకూ నిర్వహించనున్నారు.
 
కాగా ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందగా మిగిలిన 13 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 
 
మొత్తంగా ముంబై టీమ్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. దుబాయ్ పిచ్ తొలుత పేసర్లకు అనుకూలించి.. ఆ తర్వాత స్పిన్నర్లికి సహకరించే అవకాశం ఉంది. దాంతో.. టాస్ గెలిచిన టీమ్ ఛేదనకే మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

తర్వాతి కథనం
Show comments