Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లి సంచలన నిర్ణయం: టీ-20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై

Advertiesment
Virat Kohli
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (18:35 IST)
Kohli
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. 
 
ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు కోహ్లి ట్విటర్‌ వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు.
 
ఇంకా అక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో కోహ్లీ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. నాకు అత్యంత సన్నిహితులు, రవి భాయ్, రోహిత్ శర్మతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చా. 
 
దీని గురించి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాతో పాటు సెలక్టర్లతో కూడా మాట్లాడా. ఇండియన్ క్రికెట్, టీమ్‌కు తన శాయశక్తులా కృషి చేస్తున్నానని కోహ్లీ తెలిపాడు. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉండటంలో తనకు సపోర్ట్ చేసిన అందరికీ కోహ్లీ ధన్యవాదాలు చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ ప్రియులకు గుడ్ న్యూస్: మూడు కొత్త రీఛార్జ్ ప్యాక్‌లు వచ్చేశాయ్!