Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 14వ సీజన్.. దసరా రోజే ఫైనల్.. 31 మ్యాచ్‌లు పెండింగ్

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (15:21 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ ఎడిషన్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన టోర్నీ యూఏఈలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దసరా రోజు అంటే అక్టోబర్ 15న జరగనుంది. 
 
ఇప్పటికే బీసీసీఐ అధికారులు యూఏఈ బోర్డుతో సమావేశమయ్యారు. ఈ సమావేశం బాగా జరిగిందని, మిగిలి మ్యాచ్‌లను దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో విజయవంతంగా నిర్వహిస్తామన్న విశ్వాసం బీసీసీఐలో ఉందని బోర్డు అధికారి ఒకరు ఏఎన్ఐకి వెల్లడించారు. ఇప్పటికే 29 మ్యాచ్‌లు పూర్తయిన ఐపీఎల్‌లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
 
దీనికోసం కనీసం 25 రోజుల సమయం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామని బోర్డు చెబుతూ వస్తోంది. ఇండియాలో ఎలాగూ సాధ్యం కాదని భావించి టోర్నీని యూఏఈకి తరలించారు. అయితే మిగిలిన టోర్నీకి పలువురు విదేశీ స్టార్ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు కనపించడం లేదు. చాలా వరకూ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎవరైనా రాకపోతే అప్పుడు చూస్తామని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments