Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 14వ సీజన్.. దసరా రోజే ఫైనల్.. 31 మ్యాచ్‌లు పెండింగ్

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (15:21 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ ఎడిషన్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన టోర్నీ యూఏఈలో జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ దసరా రోజు అంటే అక్టోబర్ 15న జరగనుంది. 
 
ఇప్పటికే బీసీసీఐ అధికారులు యూఏఈ బోర్డుతో సమావేశమయ్యారు. ఈ సమావేశం బాగా జరిగిందని, మిగిలి మ్యాచ్‌లను దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో విజయవంతంగా నిర్వహిస్తామన్న విశ్వాసం బీసీసీఐలో ఉందని బోర్డు అధికారి ఒకరు ఏఎన్ఐకి వెల్లడించారు. ఇప్పటికే 29 మ్యాచ్‌లు పూర్తయిన ఐపీఎల్‌లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
 
దీనికోసం కనీసం 25 రోజుల సమయం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామని బోర్డు చెబుతూ వస్తోంది. ఇండియాలో ఎలాగూ సాధ్యం కాదని భావించి టోర్నీని యూఏఈకి తరలించారు. అయితే మిగిలిన టోర్నీకి పలువురు విదేశీ స్టార్ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు కనపించడం లేదు. చాలా వరకూ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎవరైనా రాకపోతే అప్పుడు చూస్తామని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments