ఐపీఎల్ 2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ల మధ్య ఆదివారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది. ఇక, ఈ మెగా ఫైట్లో ఇరుజట్లలో క్షణాల్లో ఆటను మార్చగల దమ్మున్న ఆటగాళ్లు ఉన్నారు. ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ ముగింపుకు వచ్చేసింది. విజేత ఎవరో తెలుసుకోవడానికి కేవలం నాలుగు మ్యాచ్ల దూరం మాత్రమే ఉంది.
ఐపీఎల్ రెండో దశ ప్రారంభం అయిన దగ్గరనుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించింది. వారి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ టాప్ల నాచ్లో ఉన్నాయి. అయితే ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో మాత్రం ఆఖరి బంతికి ఓటమి పాలైంది.
యూఏఈలో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక చెన్నై తన మొదటి నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. అయితే తర్వాత మూడు మ్యాచ్ల్లో మాత్రం పరాజయాలు పలకరించాయి. ఈ మూడు మ్యాచ్ల్లోనూ చెన్నై మొదట బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో బలంగా ఉన్న ఢిల్లీ మీద విజయం సాధించాలంటే.. చెన్నై సర్వశక్తులూ ఒడ్డాల్సిందే.