Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ సరికొత్త రికార్డ్.. 150 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (19:11 IST)
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కెప్టెన్‌ కూల్‌ మహీ ఐపీఎల్‌ చరిత్రలో 150 మందిని ఔట్‌ చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ నిలిచాడు. ఐపీఎల్‌ 2021లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఫీట్‌ అందుకున్నాడు. 
 
నితీశ్‌ రాణా క్యాచ్‌ అందుకోవడం ద్వారా మైలురాయి చేరుకున్నాడు. లీగ్‌లో ధోనీ ఇప్పటి వరకు 111 క్యాచ్‌లు అందుకోగా.. 39 స్టంపౌట్‌లు చేశాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండే ధోనీ క్షణాల్లో స్టంపింగ్‌లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ధోనీ తర్వాత కోల్‌కతా మాజీ కెప్టెన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. దినేశ్‌ ఇప్పటి వరకు 112 క్యాచ్‌లు, 31 స్టంపింగ్‌లు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...

నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు

Pakistan Train: పాకిస్థాన్ రైలు హైజాక్.. ఆరుగురు సైనికులు మృతి

Telangana tunnel: సొరంగంలో రోబోట్ టెక్నాలజీతో గాలింపు చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adhi Da Surprise: కేతికా శర్మ హుక్ స్టెప్ వివాదం.. స్కర్ట్‌ను ముందుకు లాగుతూ... ఏంటండి ఇది?

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments