Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ ఛాలెంజర్స్‌కు చుక్కెదురు... ఆ క్యాచ్‌ను పడిక్కల్ పట్టేసి ఉంటే..?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (11:05 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ 2020 అంతగా కలిసిరాలేదు. కప్ గెలుచుకోవాలనే కలలతో ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన కోహ్లీసేన ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడానికి ముందు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోగా.. ఎలిమినేటర్‌లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుండి వైదొలిగింది. 
 
సన్ రైజర్స్ ఎప్పటిలాగే బౌలింగ్‌లో మెరవడంతో పరుగులు సాధించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్ళు చాలా కష్టపడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
ఏబీ డివిలియర్స్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరోన్ ఫించ్ 32 పరుగులు చేశాడు. షాబాజ్ నదీమ్ ఓ వికెట్ తీశాడు. ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. పడిక్కల్ 1 పరుగుకే నిష్క్రమించగా, మొయిన్ అలీ డకౌట్ అయ్యాడు. శివమ్‌ దూబే (8), సుందర్‌ (5) కూడా చేతులు ఎత్తేసారు.
 
హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్‌కు 3, నటరాజన్ కు 2 వికెట్లు లభించాయి.ఛేజింగ్ లో సన్ రైజర్స్ కు పెద్దగా కలిసిరాలేదు. గోస్వామి డకౌట్ కాగా, కెప్టెన్ వార్నర్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మనీష్ పాండే సైతం 24 పరుగులు చేసి జంపా బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రియమ్ గార్గ్ (7) మరోసారి నిరాశపరిచాడు.
 
దీంతో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది హైదరాబాద్. మ్యాచ్ కాస్త టెన్షన్ కు వచ్చినా విలియమ్సన్-హోల్డర్ మ్యాచ్ ను ముగించేశారు. కేన్ విలియమ్సన్‌ (50; 44 బంతుల్లో, 2×4, 2×6) తో పాటూ జాసన్ హోల్డర్ (24; 20 బంతుల్లో, 3×4) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్‌ ఆదివారం క్వాలిఫైయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
 
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ నుండి అవుట్ అవ్వడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ముఖ్యంగా తమ జట్టు కావాల్సిన పరుగులు చేయలేకపోయిందని అన్నాడు. 131 పరుగులతో గెలవడం కష్టమని అన్నాడు. అలాగే కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను దేవదత్ పడిక్కల్ పట్టేసి ఉండి ఉంటే మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేదని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments