Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి మిచెల్ మార్ష్ దూరం!!

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:38 IST)
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్లలో ఒకరైన మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2020 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న ఈ జట్టుకు మార్ష్ దూరంకానుండటం మరింత కుంగదీయనుంది. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడిన విషయం తెల్సిందే. ఈ గాయం పెద్దది కావడంతో మొత్తం ఐపీఎల్‌కే దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో అతడు బంతి వేసిన అనంతరం పిచ్‌పై జారి పడ్డాడు. ఈ క్రమంలో కాలి మడమ నొప్పితో విలవిల్లాడాడు. 
 
ఫిజియో వచ్చి చికిత్స చేసినా ఓవర్‌ మధ్యలోనే మైదానం వీడాడు. మార్ష్‌ గాయం చాలా తీవ్రంగానే కనిపిస్తోందని, ఈ స్థితిలో అతను మిగతా మ్యాచ్‌ల్లో బరిలోకి దిగడం అనుమానమేనని జట్టు వర్గాలు తెలిపాయి. మార్ష్‌ స్థానంలో డాన్‌ క్రిస్టియన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్‌రైజర్స్‌ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments