Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోయర్ ఆర్డర్‌లో ఎందుకు వస్తున్నానంటే.. : ఓటమికి ధోనీ వివరణ

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:16 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. రాయల్స్ నిర్ధేశించిన 217 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
ఈ ఓటమికి గల కారణాలను సీఎస్కే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విశ్లేషించాడు. 217 పరుగులు అసాధ్యమైన లక్ష్యమేమీ కాదని వ్యాఖ్యానించిన ఆయన, 14 రోజుల క్వారంటైన్ తమ సన్నద్ధతపై ప్రభావం చూపిందని అన్నాడు.
 
తమకు సాధన చేసేందుకు అవసరమైన సమయం దొరకలేదన్నారు. ముఖ్యంగా తాను, గడచిన ఏడాదిగా ఆడకపోవడంతోనే లోయర్ ఆర్డర్‌లో వస్తున్నానని చెప్పాడు. జట్టులో ఇద్దరు ఆటగాళ్లతో పాటు 13 మందికి కరోనా రావడం ప్రభావం చూపిందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు శామ్ కరణ్‌తో పాటు రవీంద్ర జడేజాను ముందు పంపిస్తూ, ధోనీ ఆరో స్థానంలో దిగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆఖరి ఓవర్లో మాత్రమే మూడు సిక్స్‌లు బాది, తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటాడు. అయినా, ఈ మ్యాచ్‌లో ధోనీ ఆట సీఎస్కేను విజయ తీరాలకు చేర్చలేకపోయింది. ధోనీ మరో ఓవర్ ముందే తన బ్యాట్‌ను ఝళిపిస్తే బాగుండేదని సీఎస్కే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్

చనిపోయాడనుకున్న వ్యక్తిని ఆ పచ్చబొట్టు కాపాడింది.. నిరంజన్ రెడ్డి అలా కాపాడారు

ప్లీజ్.. ఎమ్మెల్యే పింఛన్ మంజూరు చేయండి : దరఖాస్తు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

TGSRTC: ఐటీ కారిడార్‌లో 275 ఎలక్ట్రిక్ బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments