Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బ్యాట్ పట్టిన హిట్ మ్యాన్ : ముమ్మరంగా ప్రాక్టీస్!

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (15:54 IST)
ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టుకు 'హిట్ మ్యాన్‌'గా పేరుగాంచిన రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. అయితే, ఇటీవల తొడకండరాలు పట్టేయడంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈ గాయన నుంచి కోలుకున్న రోహిత్.. తిరిగి బ్యాట్ పట్టుకున్నాడు. 
 
సోమవారం రాత్రి ముంబై ప్రాక్టీస్‌ సెషన్‌లో నెట్స్‌లో సాధన చేశాడు. అబుదాబి వేదికగా బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ముంబై తలపడనుంది. ప్రస్తుతం రోహిత్‌ గాయం తీవ్రతపై ఎలాంటి స్పష్టత లేనప్పటికీ.. ప్లేఆఫ్‌ బెర్తు లేదా టేబుల్‌ టాపర్‌గా నిలువాలని ముంబై పట్టుదలతో ఉంది. అందుకే బెంగళూరుతో మ్యాచ్‌ ఆడేందుకు రోహిత్‌ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. 
 
కాగా, ముంబై జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, బెంగళూరు జట్లు కూడా 14 పాయింట్లతో ఉన్నాయి. గత కొద్దిరోజులుగా పంజాబ్‌తో పాటు కొన్ని జట్లు అనూహ్య ప్రదర్శన చేస్తుండటంతో ప్లే బెర్తుకు పోటీ పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం
Show comments