గదిలో నేను నా భార్య కలిసే ఉంటాం కదా..? పగలబడి నవ్వుకున్న క్రికెటర్లు

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:11 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సందడి దుబాయ్‌లో మొదలైంది. చెన్నై టీమ్‌లో కరోనా కేసులు బయటపడడంతో కఠిన నియమాల మధ్య ఆటగాళ్ళ గడుపుతున్నారు. రకరకాల ఆంక్షలు పాటించాల్సి వస్తోంది. అలాగే బయోబుడగ దాటకుండా జియో ట్యాగింగ్‌తో అనుక్షణం వారిని గమనిస్తోంది ఓ టీమ్. తాజాగా ఇలాంటి వాతావరణంలో గడుపుతున్నవారి అనుభవం ఎలా ఉంటుందో ఢిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వివరించాడు. 
 
తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఈ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. డే బై డే కరోనా పరీక్షలు చేయించుకుంటామని, గది దాటితే జియో ట్యాగింగ్‌ పరికరం ఉండాల్సిందే అన్నారు. ఆటగాళ్ళు దగ్గర దగ్గరగా వెళుతున్నప్పుడు అది మమ్మల్ని అలర్ట్ చేస్తోంది. వెంటనే ఆ పరికరంలోని గంట కూడా మోగుతుంది. ప్రస్తుతం అధికారులు ఇంతటి కఠిన నిబంధనల మధ్య మమ్మల్ని ఉంచుతున్నారని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఓ ఆటగాడు ప్రశ్న వేశాడు. సర్.. మా భార్యలు కూడా ఇలాంటి పరికరం ధరించాలా అని.. బయో బుడగలో ఉన్న ఎవరైనా సరే దీనిని ధరించాల్సిందేనని అధికారులు తెలిపారు. "అవునా మరి గదిలో నేను నా భార్య కలిసే ఉంటాం కదా" అంటూ హస్యంగా సమాధానం ఇచ్చాడు. దానికి అక్కడ పగలబడి నవ్వుకున్నాం అంటూ" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

తర్వాతి కథనం
Show comments