Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : విరాటుడి రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ ప్లేయర్!!

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (13:34 IST)
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ కొనసాగుతున్నారు. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఐపీఎల్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతంగా ఐదు వేల పరుగులు చేసిన విదేశీ క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఆదివారం రాత్రి అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో వార్నర్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు.
 
ఈ క్రమంలో డేవిడ్ వార్నర్... ఐదు వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో నాలుగో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. వార్నర్ కంటే ముందు సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్), విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)లు ఉన్నారు. ఈ ముగ్గురిలో సురేష్ రైనా మినహా మిగిలిన ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం సాగుతున్న ఐపీఎల్ 2020లో కూడా ఆడున్నారు.
 
అంతేకాకుండా, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును వార్నర్ బ్రేక్ చేశాడు. కోహ్లీ మొత్తం 157 మ్యాచ్‌లలో ఐదు వేల పరుగులు చేయగా, వార్నర్ మాత్రం కేవలం 135 మ్యాచ్‌లలో ఈ రికార్డును సాధించాడు. అయితే, సురేష్ రైనా 173, రోహిత్ శర్మ 187 మ్యాచ్‌లు ఆడారు.
 
అయితే, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డు మాత్రం చెక్కు చెదరలేదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు అంటే 5759 రన్స్ చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. మొత్తం 187 మ్యాచ్‌లలో ఐదు సెంచరీలు, 38 అర్థ సెంచరీలతో కోహ్లీ ఈ రన్స్ చేశాడు. ఆ తర్వాత సురేష్ రైనా, రోహిత్ శర్మలు ఉన్నారు.
 
అంతేకాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ కూడా అధిక పరుగులు చేసిన ఆటగాళ్ళ జాబితాలో ఐదో క్రికెటర్‌గా ఉన్నాడు. అంతేకాకుండా, ఆదివారం నాటి మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన ధావన్.. ఐదు వేల పరుగులు రికార్డును బ్రేక్ చేసేందుకు సమీపంలోనే ఉన్నాడు. ప్రస్తుతం ధావన్ 4938 పరుగులు చేయగా, డి విలియర్స్, ధోనీ, క్రిస్ గేల్, రాబిన్ ఊతప్ప, గౌతం గంభీర్‌లు టాప్-10 జాబితాలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments