Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాష్‌రూంకు వెళ్లొచ్చేసరికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది.. సీఎస్కేను 'తలైవా' కూడా రక్షించలేడు...

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (09:05 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ఇప్పటివరకు 12 సీజన్లు జరిగాయి. ప్రస్తుతం యూఏఈ గడ్డపై 13వ సీజన్ జరుగుతోంది. ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస ఓటములను చవిచూస్తోంది. ముఖ్యంగా, గతంలో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచి, ఓసారి రన్నరప్‌గా నిలిచిన ఐపీఎల్.. ఈ సీజన్‌లో మాత్రం ఘోర పరాజయాలను చవిచూస్తోంది.

ముఖ్యంగా, చెన్నై జట్టు గెలవుకపోయినా ఫర్లేదుకానీ, వికెట్లు పడకుంటే చాలురా బాబూ అంటూ సీఎస్కే ఫ్యాన్స్ కోరుకునే స్థాయికి ఆ జట్టు ప్రదర్శన దిగజారిపోయింది. ఫలితంగా ఘోర పరాభవాలను మూటకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో అత్యంత దారుణంగా ఆడిన జట్టు ఇదే. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో, జట్టుపై అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు పూర్తిగా తేలిపోయిందన్నారు. వాష్ రూమ్‌కి వెళ్లొచ్చేసరికి చెన్నై టాప్ ఆర్డర్ పెవిలియన్‌కు చేరిందన్నారు. 
 
వాష్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత స్కోరు చూసి షాకయ్యానని అన్నాడు. గతంలో తమ జట్టు ఆటగాళ్లు బంతిని బాదుతుంటే చెన్నై అభిమానులు కేరింతలు కొట్టే వారని... కానీ నిన్న మాత్రం 'వికెట్ పడకుంటే చాలురా భగవంతుడా' అని కోరుకున్నారని చెప్పాడు. ఈ సారి సీఎస్కేని తలైవా (రజనీకాంత్) కూడా కాపాడలేరని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాల్య వివాహాలను ఆపండి.. 18ఏళ్లు నిండిన తర్వాత మహిళలకు వివాహం చేయండి

సీఎం సహాయ నిధికి చిరంజీవి రూ.కోటి విరాళం

ఆర్థిక ఇబ్బందులు, అంధత్వం.. ఆత్మహత్యాయత్నం జంట మృతి.. ఆస్పత్రిలో కుమార్తె

ఎయిర్‌లైన్స్ ప్రతినిధుల నిర్లక్ష్యం : ప్రయాణికులను వదిలివెళ్లిన ఇండిగో విమానం

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments