చెన్నై కింగ్స్‌కు ఊరట... హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.. కానీ..?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (17:07 IST)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కరోనా కాస్త ఊరటనిచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కరోనా బారినపడ్డ ఇద్దరు ఆటగాళ్లతో పాటు మిగతా సహాయ సిబ్బందికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. దీంతో హమ్మయ్య అంటూ చెన్నై ఆటగాళ్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా పది మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌, బీసీసీఐతో పాటు మిగతా ప్రాంఛైజీలు కూడా షాక్‌కు గురయ్యాయి. తాజాగా సీఎస్‌కే అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త బయటకు వచ్చింది. 
 
చెన్నైకి చెందిన బౌలర్‌ దీపక్‌ చాహర్‌, యువ బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. వీరందరినీ బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు ట్రైనింగ్‌ను ప్రారంభించకపోవడంతో చెన్నై జట్టు ఇబ్బంది పడుతుంది.

నెగెటివ్‌గా తేలిన వారంతా సాధనలో పాల్గొనాలంటే సెప్టెంబర్‌ 3న నిర్వహించే టెస్టులో మరోసారి కోవిడ్‌-19 ఫలితం నెగెటివ్‌గా రావాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 12 వరకు చాహర్‌, గైక్వాడ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

తర్వాతి కథనం
Show comments