Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ రికార్డునే బ్రేక్ చేసిన రిషబ్ పంత్

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (16:19 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా, ఆయన చేసిన రికార్డులు అనేకం. అటు కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన అనేక రికార్డులను నమోదు చేస్తున్నాడు.
 
అయితే, ధోనీ చేసిన రికార్డుల్లో ఒక రికార్డును మాత్రం యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం కాదు. స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్‌‌లో ఈ రికార్డు బ్రేక్ అయింది. 
 
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 18 బంతుల్లోనే 50 రన్స్ రాబట్టాడు. దీంతో గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ చేసిన వేగవంతమైన హాఫ్ సెంచరీ (20 బంతుల్లో) రికార్డును పంత్‌ అధిగమించాడు. ధోనీ 2012 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌‌పైనే వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. 
 
ఇకపోతే, ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీని టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ నమోదు చేసాడు. 2018లో రాహుల్‌ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉండగా, సునీల్‌ నరైన్‌, యూసుఫ్‌ పఠాన్‌లు సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు 15 బంతుల్లో 50 పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments