Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది మంది ఆడారు... 19 పరుగులే చేశారు.. హైదరాబాద్ ఘోర పరాజయం

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (10:42 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ బౌలింగ్ ధాటికి హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. ఐపీఎల్ ట్వంటీ-20లో భాగంగా లీగ్ దశలో భాగంగా 30వ పోటీ ఆదివారం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి పృథ్వీ షా నాలుగు పరుగులకే అవుట్ కావడం షాక్ నిచ్చింది. 
 
కానీ బ్యాటింగ్‌కు దిగి శ్రేయాస్ ఐయ్యర్ (45), కెలిన్ (40) నిలకడగా ఆడటంతో 20 ఓవర్లలో ఢిల్లీ ఏడు వికెట్ల పతనానికి 155 పరుగులు సాధించింది. తదనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 
 
వార్నర్ 51 పరుగులు, పోర్స్డో 41 పరుగులు సాధించారు. కానీ తర్వాత బరిలోకి దిగిన బ్యాట్స్‌మెన్లు వరుసగా స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్లు ఆడినా ఢిల్లీ బౌలింగ్ ధాటికి కేవలం 19 పరుగులు మాత్రమే సాధించగలిగారు. దీంతో హైదరాబాద్ జట్టు 116 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఢిల్లీ 39 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments