Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి తప్పని జరిమానా.. రోహిత్, రహానే, ధోనీకి తర్వాత విరాటే,..?

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (12:22 IST)
స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీపై ఐపీఎల్ మేనేజ్‌మెంట్ జరిమానాను విధించింది. శుక్రవారం జరిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి జరిమానా విధించినట్లు ఐపీఎల్ వెల్లడించింది.


ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, నియమిత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడం నేరమన్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ మ్యాచ్ ఫీజులో కొంత జరిమానాగా చెల్లించక తప్పలేదు.
 
ఈ సీజన్‌లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా చెల్లించిన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ లోనే రోహిత్ జరిమానా కట్టాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానే కూడా ఇదే తరహా శిక్షకు గురయ్యాడు.
 
అలాగే టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా పడింది. గురువారం రాత్రి రాజస్థాన్‌  రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. దీంతో మిస్టర్‌ కూల్‌కు చేదు అనుభవం ఎదురైంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments