Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పల్‌లో క్రికెట్ పండుగ : హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (10:22 IST)
ఐపీఎల్ 2019 11వ సీజన్‌లో భాగంగా ఫైనల్ పోటీలు హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనుంది. ముందుగా ప్రకటించిన ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకారం మే 12వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానానికి తరలించారు. దీనికి కారణం... చిదంబరం స్టేడియంలో హైకోర్టు ఆదేశాల మేరకు మూసివున్న మూడు స్టాండ్స్‌ను తెరిపించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావడంలో తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) విఫలమైంది. దీంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అయితే క్వాలిఫయర్‌ -1 మాత్రం చెన్నైలోనే జరుగుతుంది. దీంతో సీఎస్‌కే టాప్‌-2లో నిలిస్తే తమ సొంత మైదానంలోనే ఈ మ్యాచ్‌ ఆడవచ్చు. ఇక మే 8వ తేదీన జరిగే ఎలిమినేటర్‌, 10వ తేదీన జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లను విశాఖపట్నానికి తరలించారు. నిజానికి ఈ రెండు కూడా హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. కానీ 6, 8, 10వ తేదీల్లో తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో మ్యాచ్‌లకు పోలీసు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments