Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పల్‌లో క్రికెట్ పండుగ : హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (10:22 IST)
ఐపీఎల్ 2019 11వ సీజన్‌లో భాగంగా ఫైనల్ పోటీలు హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనుంది. ముందుగా ప్రకటించిన ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకారం మే 12వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానానికి తరలించారు. దీనికి కారణం... చిదంబరం స్టేడియంలో హైకోర్టు ఆదేశాల మేరకు మూసివున్న మూడు స్టాండ్స్‌ను తెరిపించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావడంలో తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) విఫలమైంది. దీంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అయితే క్వాలిఫయర్‌ -1 మాత్రం చెన్నైలోనే జరుగుతుంది. దీంతో సీఎస్‌కే టాప్‌-2లో నిలిస్తే తమ సొంత మైదానంలోనే ఈ మ్యాచ్‌ ఆడవచ్చు. ఇక మే 8వ తేదీన జరిగే ఎలిమినేటర్‌, 10వ తేదీన జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లను విశాఖపట్నానికి తరలించారు. నిజానికి ఈ రెండు కూడా హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. కానీ 6, 8, 10వ తేదీల్లో తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో మ్యాచ్‌లకు పోలీసు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments