Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరుకు షాకిచ్చిన సన్‌రైజర్స్ : ప్లే ఆఫ్ నుంచి కోహ్లీ సేన్ ఔట్?

ఐపీఎల్ 2018 పోటీల్లో భాగంగా, సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు హైదరాబాద్ జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5పరుగుల తేడాతో గెలుపొంది కోహ్లీ సేనకు తేరుకోలేని

Webdunia
మంగళవారం, 8 మే 2018 (09:59 IST)
ఐపీఎల్ 2018 పోటీల్లో భాగంగా, సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు హైదరాబాద్ జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 5పరుగుల తేడాతో గెలుపొంది కోహ్లీ సేనకు తేరుకోలేని షాకిచ్చింది.
 
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. తర్వాత 147 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌తో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ(39), కొలిన్ గ్రాండ్‌హోమ్(33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 
 
ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితంకావాల్సి వచ్చింది. షకీబ్ 2 వికెట్లు, భువనేశ్వర్, సందీప్, సిద్ధార్థ్, రషీద్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అదేసమయంలో కోహ్లీ సేనకు ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతయ్యాయి. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments