Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రనౌట్ మా కొంపముంచింది.. దినేష్ కార్తీక్

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతాలో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయింది.

Webdunia
శనివారం, 26 మే 2018 (14:29 IST)
ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతాలో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయింది.
 
దీనిపై ఆ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ స్పందిస్తూ, హైదరాబాద్ జట్టు చేతిలో ఎదురైన ఓటమి జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు. సీజన్‌ చివరివరకు ఆకట్టుకున్నప్పటికీ కీలక మ్యాచ్‌‌లో పరాజయం చెందడం తీవ్ర నిరాశను మిగిల్చిందన్నాడు. సన్‌‌రైజర్స్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంచి ఆరంభం లభించినప్పటికీ, కొన్ని చెత్త షాట్లతో పాటు ఒక రనౌట్‌ మా కొంప ముంచిందనీ, ముఖ్యంగా రనౌట్ వల్లే ఓడిపోయినట్టు తెలిపాడు. 
 
174 పరుగులను ఛేదించే క్రమంలో తమకు గొప్ప ఆరంభం లభించిందని.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. తనతోపాటు నితీష్‌ రాణా, రాబిన్‌ ఉతప్పలు మ్యాచ్‌‌ను ముగిస్తే బాగుండేదన్నాడు. దీంతో ఓటమి చూడాల్సి వచ‍్చిందని.. సన్‌ రైజర్స్‌ మాకంటే మెరుగ్గా రాణించి గెలుపును సొంతం చేసుకుందని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments